Dil Raju | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) మేనల్లుడు అశిష్ రెడ్డి (Ashish reddy) త్వరలో ఇంటివాడవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన అద్విత రెడ్డితో అశిష్ రెడ్డి ఏడడుగులు వేయబోతున్నాడు. ఇక వీరి నిశ్చితార్థం 2023 నవంబర్లో జరుగగా.. జైపూర్లో జరుగనున్న ఈవెంట్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఫిబ్రవరి 14న జైపూర్లో ఘనంగా వివాహ వేడుక నిర్వహించేందుకు రెడీ అవుతుంది దిల్ రాజు కుటుంబం.
ఈ నేపథ్యంలో దిల్ రాజు, శిరీష్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందజేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అశిష్ రెడ్డి వెడ్డింగ్ ఈవెంట్కు రావాల్సిందిగా.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మాజీ సీఎం కేసీఆర్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, వెంకటేశ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మోహన్ బాబులకు శుభలేఖ అందించారు. ఇదిలావుంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులకు కూడా దిల్ రాజు శుభలేఖ అందించారు. ఫిబ్రవరి 14న జరుగనున్న ఈ వెడ్డింగ్ ఈవెంట్కు రావాల్సిందిగా మహేష్ బాబును నమ్రతా శిరోద్కర్ను దిల్ రాజు, అశిష్ కోరారు. కాగా మహేష్కు దిల్ రాజు ఆహ్వానం అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.