గతేడాది టాలీవుడ్ (Tollywood) యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) నటించిన సీటీమార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi). ఈ భామ తాజాగా ఓ కుర్ర హీరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త ఫిలినంగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. యువ హీరో ఆదిసాయికుమార్ (Aadi Saikumar) సరసన హీరోయిన్గా ఫైనల్ చేశారు మేకర్స్.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి ఫణి క్రిష్ణ సిరికి దర్వకత్వం వహించనున్నాడు. హిందీలో సన్నీలియోన్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ది బాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు డార్క్ పాత్ మూవీ చేస్తోంది. తెలుగులో సందీప్ కిషన్ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్కు ఎంపికైంది.
We are very much delighted to welcome the gorgeous @DiganganaS onboard for our #ProductionNo10!
Shoot in progress 🎥 Stay tuned for updates!
⭐ing @AadiSaikumar @SriSathyaSaiArt @KKRadhamohan #PhaniKrishnaSiriki #Dhruvan #SatishMutyala @UrsVamsiShekar pic.twitter.com/pKad7k8e2h
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 11, 2022
గతేడాది బీఏ డిగ్రీని పూర్తి చేసిన ఈ బ్యూటీ ..ఆ తర్వాత తనకిష్టమైన ఎంబీఏ ప్రోగ్రామ్ (MBA program)లో చేరింది. ఓవైపు చదువు, మరోవైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది దిగంగనా.