సినిమాల్లో సహజంగా కనిపించడానికి యాక్టర్స్ ఎంతో కష్టపడుతుంటారు. బరువు పెరగడం, తగ్గడం, తమకు తెలియని విద్యలు నేర్చుకోవడంలాంటి చేస్తుంటారు. అలాగే బాలీవుట్ నటి పరిణీతి చోప్రా కూడా తన లేటెస్ట్ మూవీ సందీప్ ఔర్ పింకీ పరార్ మూవీలో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయలేదని చెప్పింది. మురికిగా ఉన్న ప్రదేశంలో పడుకున్నానని, మరుసటి రోజు స్నానం చేయకుండా అలాగే సెట్కు వచ్చేశానని ఆమె చెప్పడం విశేషం. ఈ మూవీలో అనుకోని ఘటనలో గర్భ విచ్ఛిత్తి జరగడం, కొన్ని రోజుల పాటు ఆమె అదే షాక్లో ఉన్న సీన్లను సహజంగా తెరకెక్కించడానికి ఈ ప్రయత్నం చేశారు. ఈ సీన్ గురించి ఆమె ఈ మధ్య మీడియాకు వివరించింది.
కొండ ప్రాంతంలోని ఓ గుడిసెలో రెండు, మూడు రోజుల పాటు ఆ సీన్ చిత్రీకరణ జరిగింది. నేను చెప్పేది వింటే ఎవరు ఏమనుకుంటారో తెలియదు కానీ.. ఆ సీన్ కోసం నేను రెండు రోజులు స్నానం చేయలేదు. ఆ ప్రాంతం మొత్తం మురికిగా ఉండేది. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే సమయానికి నా ఒళ్లంతా బురదమయమయ్యేది. కానీ నేను అలాగే వెళ్లి మరుసటి రోజు స్నానం చేయకుండా షూటింగ్లో పాల్గొనేది అని పరిణీతి చెప్పింది. అత్యంత సహజంగా, మేకప్ సాయం లేకుండా ఆ సీన్ ఉండేలా చూడటానికే తాను ఇలా చేశానని ఆమె తెలిపింది. సందీప్ ఔర్ పింకీ ఫరార్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియలో రిలీజైంది.