Dhurandar 2 |బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్గా నిలవడమే కాకుండా, ఓటీటీ వేదికలపై కూడా మంచి వ్యూయర్షిప్ సాధించింది. ఈ విజయోత్సాహంలోనే ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ‘ధురంధర్ 2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పోస్టర్ విడుదల కావడంతో పాటు ఓ కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ‘ధురంధర్ 2’ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
తొలి భాగం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా, సీక్వెల్కు మాత్రం ఓటీటీ పార్ట్నర్ మార్పు ఎందుకు జరిగిందనే అంశంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. భారీ డీల్, గ్లోబల్ రీచ్, మార్కెటింగ్ స్ట్రాటజీ వంటి కారణాల వల్ల ఈ మార్పు జరిగి ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీక్వెల్ పోస్టర్లో చూపించిన యాక్షన్ టోన్, డార్క్ థీమ్ ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ రేపుతోంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచింది.. సోషల్ మీడియాలో ఇప్పటికే #Dhurandhar2 హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రామ్పాల్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగం కంటే ఈసారి కథ మరింత థ్రిల్లింగ్గా, యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
మార్చి 19న ‘ధురంధర్ 2’ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్తో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా భారీ రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ‘ధురంధర్ 2’ ఓటీటీ పార్ట్నర్ మార్పు నుంచి టీజర్ అంచనాల వరకు ప్రతి అంశం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. యాక్షన్, స్పై, స్టార్ పవర్ కలయికతో ఈ సీక్వెల్ మరో సంచలనాన్ని సృష్టించడానికి రెడీ అవుతోంది.