పవన్కల్యాణ్ ‘బ్రో’ చిత్రంలో సాయిధరమ్తేజ్ తమ్ముడిగా నటించిన శ్రీనివాస్ హీరో అయ్యాడు. అతను కీలక పాత్రలో ‘దీన్ తననా’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. హుస్సేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురువారం లండన్లో మొదలైంది.
ముహూర్తపు సన్నివేశాన్ని ప్రముఖ నటుడు అలీ, శ్రీనివాస్లపై చిత్రీకరించారు. పదిరోజులు లండన్లోనే చిత్రీకరణ జరిపి ఇండియాకు తిరిగివస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఏ సార్ట్ ప్రొడక్షన్స్, ఏబీ ఇంటర్నేషనల్ ఫిలింస్, అనిక ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.