లక్ష్ చదలవాడ ప్రస్తుతం మంచి కమర్షియల్ సబ్జెక్ట్తో రాబోతున్నారు. ‘వలయం’, ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’ వంటి సినిమాల తర్వాత లక్ష్ చేస్తున్న మరో చిత్రం ‘ధీర’. శ్రీతిరుమల తిరుపతి వేంకటేశ్వర బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాస్, యాక్షన్ హీరోగా లక్ష్ ఆకట్టుకోనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
షూటింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ప్రధాన తారాగణం: లక్ష్, నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్ తదితరులు; సంగీతం: సాయి కార్తీక్; నిర్మాత: పద్మావతి చదలవాడ; రచన-దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్.