Dhanush | శేఖర్కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. గతేడాది ఈ సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. లవ్స్టోరిలాంటి బ్లాక్బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల (Shekhar Kammula) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ మూవీ షూటింగ్ 2024 ఫిబ్రవరిలో షురూ కానుందట. అంతేకాదు దీని కోసం హైదరాబాద్లో స్పెషల్ సెట్ కూడా వేస్తున్నారని ఇన్సైడ్ టాక్. కథానుగుణంగా ముంబై, చెన్నై, హైదరాబాద్లలో షూటింగ్ జరుపనున్నట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగా.. త్వరలోనే మరిన్ని వివరాలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారట. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ధనుష్కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు వార్తలు వస్తుండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.