దక్షిణాదిలో మరో ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కింది. అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురువారం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ధనుష్పై చిత్రీకరించిన సన్నివేశాలతో రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టారు.
సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘నా సామిరంగ’ ‘కెప్టెన్ మిల్లర్’ (తమిళం) చిత్రాలతో నాగార్జున, ధనుష్ మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనికా నిగోత్రే, సమర్పణ: సోనాలి నారంగ్, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.