తమిళ హీరో ధనుష్ ఓ భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై టి.జి. త్యాగరాజన్ సమర్పణలో జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. 1930-40 దశకాల నేపథ్యంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేశారు. నిర్మాత టి.జి. త్యాగరాజన్ మాట్లాడుతూ..‘ధనుష్తో మరోసారి సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. మాది సక్సెస్ఫుల్ కాంబినేషన్. మా సంస్థలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఈ కథను దర్శకుడు అత్యున్నత స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నాం’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – శ్రేయాస్ కృష్ణ, సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్.