D51 Movie | సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా లవ్స్టోరీ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఓ వైపు ఆకాశ హర్మ్యాలు, మరోవైపు మురికి వాడాలు, వాటి మధ్యలో నోట్ల కట్టలతో పోస్టర్ను డిజైన్ చేసి సినిమా థీమ్ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అమితాసక్తితో ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ముందుగా ఈ సినిమా కోసం ఏ.ఆర్ రెహమాన్ను సంగీత దర్శకుడిగా అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల ఆయనను పక్కన పెట్టేసి దేవి శ్రీ ప్రసాద్ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేవితో చర్చలు కూడా జరిపారని టాక్. ఇక దేవి ఈ ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో పుష్ప సీక్వెల్తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. తమిళంలో కంగువా, విశాల్34 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా దేవి మ్యూజిక్ లిస్ట్లోకి చేరిపోయింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
ఓ యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కథను తయారు చేసుకున్నారని, పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. అంతేకాకుండా సమాజంలోని ఆర్థిక అసమానతలను గురించి చర్చించే సినిమా ఇదని ఇన్సైడ్ టాక్. నాగార్జున కీలకపాత్ర పోషించనుండటంతో ఈ సినిమాపై తెలుగు ఆడియెన్స్లో మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.