‘ఓ గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలో సంభాషించే కథ ఇప్పటివరకూ రాలేదు. నా కెరీర్లోనే ఇదొక సవాలు. ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత ప్రతీ డైలాగ్ను సంగీతంగా మార్చాల్సి వచ్చింది’ అన్నారు అగ్ర సంగీత దర్శకుడు, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర స్వరకర్త దేవిశ్రీప్రసాద్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.