న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ బాలీవుడ్కే చెందిన మరో నటి నోరా ఫతేహి ఇటీవల ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పరువు నష్టం వేసింది. ఈ పిటిషన్పై మార్చి 25న విచారణ జరపనున్నట్లు ఢిల్లీ కోర్టు ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు మార్చి 25న విచారణకు రానున్న పిటిషన్ల జాబితాలో నోరా పిటిషన్ను చేర్చింది.
సుఖేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో అతనితోపాటు బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి, మరికొందరు నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఈడీ విచారించిన సమయంలో ఆమె నోరా ఫతేహి పేరును బయటపెట్టింది.
సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి తనతోపాటు మరో నటి నోరా ఫతేహీ కూడా ఖరీదైన బహుమతులు అందుకుందని ఈడీకి చెప్పింది. దాంతో ఈడీ అధికారులు నోరాకు కూడా నోటిసులు ఇచ్చి విచారించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నోరా చెప్పింది. అనంతరం ఆరోపణలు చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్పైన, ఆమె ఆరోపణలను ప్రచురించిన మీడియా సంస్థలపైన నోరా రూ.200 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.