Harshith Reddy – Smeha Manimegalai | టాలీవుడ్ యువ నటుడు హర్షిత్ రెడ్డి హీరోగా, స్మేహ మణిమేగలై హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. ఈ చిత్ర టీజర్ను నేడు విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆరంభం నుంచి ముగింపు వరకు చాలా ఇంటెన్స్గా సాగింది. ఒక యువకుడు ప్రేమలో పడి, ఆ ప్రేమ కోసం ఏ స్థాయికైనా వెళ్లే ‘దీవాన’ గా ఎలా మారాడనేది ఈ చిత్ర ప్రధానాంశం. ముఖ్యంగా “ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారురా పోరీలు” మరియు “అది నీ ప్రాణం పీక్క తినకపోతే నన్ను అడుగురా” వంటి డైలాగులు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ అర్బన్ నేపథ్యంలో సాగే ఈ స్వచ్ఛమైన మరియు ఇంటెన్స్ లవ్ స్టోరీలో హర్షిత్ రెడ్డి తన నటనతో మరియు డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించగా.. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్స్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న ఈ చిత్రం రాబోతుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ మూవీని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.