బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh) -దీపికా పదుకొనేకునే (Deepika Padukone)కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరూ స్టార్డమ్తో సినిమాలు, యాడ్స్ చేస్తూ కోట్లల్లో సంపాదిస్తూ..ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కపుల్గా నిలిచారు. ఈ ఇద్దరికి సంబంధించిన వార్త ఒకటి బీటౌన్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే దీప్వీర్ ముంబైలోని బాంద్రాలో ఖరీదైన అపార్టుమెంట్ (apartment)ను కొనుగోలు చేశారట.
11266 చదరపు అడుగుల విస్తీర్ణం, 1300 చదరపు అడుగులు టెర్రస్తో కూడిన నాలుగు అంతస్థులను కొనుగోలు చేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. అపార్టుమెంట్లోని 16, 17, 18, 19వ అంతస్థులను కొనుగోలు చేశారట. షారుఖ్ ఖాన్ పాపులర్ బంగ్లా మన్నత్ లొకేషన్ లైన్లోనే ఈ అపార్టుమెంట్స్ ఉన్నాయి. ఇంతకీ ఈ అపార్టుమెంట్ ఎంత పెట్టి కొన్నారో తెలుసా..? బీటౌన్ సమాచారం ప్రకారం అక్షరాలా రూ.119 కోట్లు. త్వరలోనే రణ్వీర్-దీపికా ఇందులోకి మారనున్నారని టాక్.
రణ్వీర్ సింగ్ ప్రస్తుతం సర్కస్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాలు చేస్తున్నాడు. దీపికా పదుకొనే తెలుగులో ప్రాజెక్టు కే, హిందీలో పఠాన్ సినిమాలు చేస్తోంది.