బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో పాటు హలీవుడ్ చిత్రాలు చేసింది. రణ్వీర్ సింగ్ని వివాహం చేసుకున్న తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న దీపికా పదుకొణే త్వరలో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించనుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలోదీపికా పదుకొణే కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే.
‘రామ్లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, పద్మావత్
వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన దీపికాకి తాజాగా గ్లోబల్ అవార్డ్ దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ‘ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021’ ని ఆమె దక్కించుకుంది. చదువు, ఆరోగ్యం, టూరిజం ఇలా వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000 వేలపైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపికా అవార్డు సాధించింది.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, బిజినెస్మెన్ జెఫ్ బెజోస్, క్రీడాకారుడు క్రీస్టీనో రోనాల్డో లాంటి హేమహేమీలతో కలిసి ఈ అవార్డ్కి దీపిక ఎంపిక కావడం విశేష్ం. ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ దీపికనే. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. దీపికా నటించిన 83 చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.