N.T.R-Prashanth Neel | జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ‘అరవింద’ తర్వాత తారక్ దాదాపు నాలుగేళ్ళకు ట్రిపుల్ ఆర్తో అభిమానులను పలకరించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించింది. రీసెంట్గానే ఈ చిత్రం 1000కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతో తారక్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ను సొంతం చేస్తున్నాడు. ప్రస్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్న తారక్ త్వరలోనే కొరటాల శివతో తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఎంపిక అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ నీల్, దీపికను కలిసి కథను వినిపించాడట. కథ నచ్చడంతో దీపిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్లో దీపిక భాగం సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం దీపిక ‘ప్రాజెక్ట్-K’ చిత్రంలో ప్రభాస్కు జోడిగా నటిస్తుంది.