బాలీవుడ్ తార దీపికా పడుకోన్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నది. ఈ చిత్రీకరణలో పాల్గొంటున్న దీపికా ఇటీవల అస్వస్థతకు గురైంది. ఆమెకు హార్ట్ రేట్ పెరగడంతో షూటింగ్ మధ్యలోనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం దీపికా ఆరోగ్యం మెరుగవడంతో షూటింగ్కు యథావిధిగా వచ్చింది. అయితే ఆమెకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ప్రభాస్ చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. దీపికా విశ్రాంతి కోసం ప్రభాస్ ఈ సూచన చేశారట. తోటి నటీనటులతో ఎంతో ప్రేమగా మెలుగుతుంటారు ప్రభాస్. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.