తారల తళుకుల మధ్య ఫ్రాన్స్లోని కేన్స్లో 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మంగళవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్ తార దీపికా పదుకోన్ హాజరయ్యారు. జ్యూరీ మెంబర్గా మిగతా సభ్యులతో కలిసి ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇండియన్ పెవిలియన్ నుంచి పూజా హెగ్డే, ఏఆర్ రెహమాన్, తమన్నా, మాధవన్ తదితరులు హాజరవుతున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఇందులో మాధవన్ నటించిన ‘రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్’ వరల్డ్ ప్రీమియర్ కానుంది. దీపికాపదుకోన్ కంటే ముందు విద్యాబాలన్, నందితాదాస్, షర్మిలా ఠాగోర్, ఐశ్వర్య కేన్స్లో జ్యూరీ సభ్యులుగా గౌరవాన్ని పొందారు.