ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అశ్లీలత, అసభ్యత పెచ్చుమీరి పోతున్నదని..ఈ ధోరణి యువతరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఓటీటీ కంటెంట్ విషయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆయా సంస్థలకు నోటీసులు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు సమా చారం. 31 మంది సభ్యులు కలిగిన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా శివసేనకు చెందిన ప్రతాప్రావ్ జాదవ్ వ్యవహరిస్తున్నారు. వివిధ పార్టీల ఎంపీలతో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
ఓటీటీ కంటెంట్ఫై నియంత్రణ విషయంలో గత ఏడాది కాలంగా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. సినిమాల మాదిరిగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద సెన్సార్షిప్ లేకపోవడంతో అడల్ట్ కంటెంట్తో వెబ్సిరీస్లు రూపొందించే ధోరణి పెరిగిపోయిందనే విమర్శలొస్తున్నాయి. అయితే ఓటీటీ ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రభుత్వ నియంత్రణ అవసరం లేదని, అది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతుండగా..మైనర్స్ను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఓటీటీలకు సెన్సార్షిప్ ఉండాలని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే విషయంపై సోమవారం జరిగిన పార్లమెంటరీ ప్యానెల్లో చర్చ జరిగినట్లు సమాచారం.
గత ఏడాది కాలంగా అభ్యంతరకరమైన కంటెంట్ విషయంలో వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్పై వచ్చిన ఫిర్యాదులను పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ పరిశీలించింది. ఇందులో సోనీలివ్పై అత్యధికంగా 4063 ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ (3203), నెట్ఫ్లిక్స్ ( 401) సంస్థలపై కైంప్లెంట్స్ అందాయి. డిస్నీహాట్స్టార్పై మాత్రం ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఓటీటీ నియంత్రణపై సాధ్యాసాధ్యాలను మరింత లో తుగా విశ్లేషించాలని నిర్ణయించు కున్న పార్లమెంటరీ కమిటీ..ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడంచెల మార్గాన్ని సూచించింది.
చందాదారులు తొలు త కంటెంట్ పబ్లిషర్కు, ఆ తర్వాత ఓటీటీ అనుబంధ రెగ్యులేటరీ వ్యవస్థకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎలాంటి పరిష్కారం లభించకపోతే చివరగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సి చేయాలని సూచించింది. సమాచార మంత్రిత్వ శాఖ నియమాలకు అనుగుణంగా ఓటీటీలపై నియంత్రణ విధించాలని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. అయితే ఈ విషయంపై మరిన్ని సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.