‘దీవాన’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు శ్రీకాంత్ సంగిశెట్టి. హర్షిత్ రెడ్డి హీరోగా వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీకాంత్ సంగిశెట్టి విలేకరులతో ముచ్చటించారు. వన్సైడ్ లవ్స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమాలో హృదయాన్ని కట్టిపడేసే భావోద్వేగాలు ఉంటాయని, ఇందులో తల్లిదండ్రుల తాలూకు ప్రేమ గురించి కూడా చూపించామన్నారు. ‘పదేళ్లక్రితం వచ్చిన ‘మిణుగురులు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశా.
ఆ తర్వాత ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. అదే సమయంలో డెమో ఫిల్మ్స్, షార్ట్ఫిల్మ్, సాంగ్ వీడియోలు చేసేవాడిని. ఎంబీఏ చేస్తున్న రోజుల్లో జెమిని టీవీ యాంకర్ని చూసి ‘దీవాన’ కథ రాసుకున్నా. ఆమె రోజూ టీవీలో కనిపించేది. ఇలాంటి అమ్మాయిని ఓ అపరిచితుడు వెళ్లి కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. దీనికి అన్ని కమర్షియల్ అంశాలను జత చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశా. ఈ సినిమాలో చర్చించిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రేక్షకులు ఓ హార్ట్టచింగ్ లవ్స్టోరీని చూసిన అనుభూతికిలోనవుతారు’ అన్నారు.