అమర్నాథ్రెడ్డి, భానుశ్రీ, సోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డెత్ గేమ్’. చేరన్ దర్శకుడు. కె.సి.సూరి, రాజశేఖర్నాయుడు నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ను ఇటీవల అగ్రహీరో నాగార్జున విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్నమైన కాన్సెప్ట్తో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. సులువుగా డబ్బు సంపాదించాలనే క్రమంలో కొందరు యువతీయువకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రాణాలను పణంగా పెట్టి ఆడిన ఈ ఆటలో వారు ఎలా విజయం సాధించారన్నది థ్రిల్లింగ్గా ఉంటుంది’ అని తెలిపారు. మార్చి నెలలో సినిమాను విడుదలచేస్తామని నిర్మాత అన్నారు. కాలకేయ ప్రభాకర్, ఆర్.జే హేమంత్, అనంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్.