రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివచందు, నీల ప్రియా, మిర్చి కిరణ్ ముఖ్యపాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం ‘డియర్ జిందగీ’. పద్మారావ్ అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్చంద్ర చల్లపల్లి నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి.
రాజా రవీంద్రపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వీవీ వినాయక్ క్లాప్ నివ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఓ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ కుటుంబంలో తండ్రి తన పిల్లలకు తోడుగా ఉంటూ సమాజం వారిని చూసి గర్వించేలా చేసుకోవడమే ఈ చిత్ర కథ. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.