పెళ్లి తర్వాత సినిమాల వేగాన్ని పెంచుతోంది కాజల్ అగర్వాల్. వైవిధ్యమైన కథాంశాలు, పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటోంది. తాజాగా ఆమె ఓ మహిళా ప్రధాన చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ కెరీర్లోనే విభిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. డీగ్లామర్ లుక్లో సరికొత్త పంథాలో ఆమె ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం జూలైలో సెట్స్పైకిరానుంది. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు నాగార్జునతో మరో ఓ సినిమా చేస్తోంది. తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.