రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, అక్సాఖాన్, రూపిక ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్రెడ్డి దర్శకుడు. ఎడవెల్లి వెంకట్రెడ్డి నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని హైదరాబాద్లో విడుదల చేశారు. సి.కల్యాణ్, ఫిల్మ్ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ రాందాసు అతిధులుగా హాజరై సినిమా యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. అన్నదమ్ముల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కిందని, ఈ నెల 15న విడుదల చేస్తున్నామని నిర్మాత చెప్పారు. దళారి పాత్ర రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందో మా సినిమాలో చూపించామని దర్శకుడు తెలిపారు. ఇంకా నిర్మాతలు దామోదరప్రసాద్, ప్రసన్నకుమార్, టీఎస్రాజు, సలీం, అఖిల్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.