Dadasaheb Phalke Award | దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్టుల ప్రదానోత్సవం మంగళవారం రాత్రి ముంబయిలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, దర్శకనిర్మాతలు హాజరయ్యారు. ‘జవాన్’ చిత్రానికిగాను బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ఖాన్ ఉత్తమ నటుడిగా, చిత్ర కథానాయిక నయనతార ఉత్తమ నటిగా అవార్డులను స్వీకరించారు.
గత డిసెంబర్లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘యానిమల్’ చిత్రానికిగాను సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్ఖాన్.. జనరంజకమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే తన అభిమతమని పేర్కొన్నారు. ‘మంచి సినిమాలు చేస్తానని మీకు మాటిస్తున్నా. యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఏ జోనర్ చిత్రమైనా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తా’ అని షారుఖ్ఖాన్ పేర్కొన్నారు.