ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం తెలుగు చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సల్మాన్ఖాన్, సంజయ్దత్ వంటి బాలీవుడ్ టాప్స్టార్స్ తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ వరుసలో బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్సింగ్ చేరబోతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ చిత్రంలో రణ్వీర్సింగ్ అతిథి పాత్రను పోషించనున్నారని సమాచారం.
కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లో రణ్వీర్సింగ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, ఆయన ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని చెబుతున్నారు. పుష్పరాజ్ పాత్రను పరిచయం చేసే పోలీస్ ఆఫీసర్గా రణ్వీర్సింగ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుందని సమాచారం. అయితే ‘పుష్ప-2’లో రణ్వీర్సింగ్ ఎంట్రీ గురించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.