ఆది సాయికుమార్, మిషా నారంగ్, నందినిరాయ్, వాసంతి, తారక్ పొన్నప్ప ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సిఎస్ఐ సనాతన్’. శివశంకర్ దేవ్ దర్శకుడు. అజయ్ శ్రీనివాస్ నిర్మాత. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ‘ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నాను. అందరికి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పూర్తి సంతృప్తిచెందుతారు. తప్పకుండా ఈ చిత్రం దర్శకుడిగా మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. కథానాయకుడు ఆది మాట్లాడుతూ ‘ కథ వినగానే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఓ క్రైమ్ సీన్పై ఖచ్చితంగా ఓ పాయింట్ చుట్టూ తిరిగే కథ తెలుగులో సిఎస్ఐ సనాతన్ మొదటిది అనుకుంటున్నాను. సినిమా అందరికి ఓ మంచి అనుభూతినిస్తుంది’ అన్నారు.