బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ నాయిక. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్లో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘ఈ షెడ్యూల్లో టాకీ పార్ట్తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాం. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్హంట్ వీడియోకు మంచి స్పందన లభించింది’ అని చిత్రబృందం పేర్కొంది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్కుమార్, చంద్రిక రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.