తెలిసి చేసిందా తెలియక చేసిందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ దేనిగురించి అంటే శృతి హాసన్ చేసిన పని గురించే చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 6న తమిళనాట అసెంబ్లీ ఎన్నికలుజరిగాయి. తండ్రి కమల్ హాసన్ తో కలిసి కూతుళ్లు శృతి హాసన్, అక్షరాహాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
ఆ తర్వాత కమల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూతులోకి వెళ్లడం వివాదాస్పదమైంది. శృతి హాసన్.. తన తండ్రి పార్టీలో కార్యకర్తగానే కాదు ఎలాంటి పదవిలోనూ లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ కూడా అంత కంటే కాదు. అలాంటి వ్యక్తిని ఎన్నికలు జరుగుతున్న ప్రదేశంలో ఎలా అనుమతించారని బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
పైగా శృతి హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నానని చెప్పడమే కాదు ట్విట్టర్లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యం’, MNM కు ఓటు వేయమని చెప్పడం కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్దమని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి భిన్నంగా ప్రవర్తించిన శృతి హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షకుడు నందకుమార్ తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్ లు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మరి కమల్ హాసన్ కూతురి పై ఎలక్షన్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
చెడ్డీలోనే పెండ్లికొడుకు..షాకైన జనం
బాలీవుడ్ నటి జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోలు
Actress Vishnupriya లేటెస్ట్ ఫోటోలు