అల్లు అర్జున్ చేసిన దర్శకులితో మళ్లీ మళ్లీ చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే సుకుమార్తో కలిసి ఆర్య, ఆర్య 2 చిత్రాలు చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – ప్రొడ్యూసర్ రాధాకృష్ణ (చినబాబు) లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ‘జులాయి’ సినిమాతో తొలతు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కాంబో ‘సన్నాఫ్ సత్యమూర్తి తో పలకరించి మరో విజయం అందుకున్నారు.
గతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషనల్ హిట్ తో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో సూపర్ హిట్ కాంబోలో నాలుగో సినిమా రాబోతోందని హింట్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోందని తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ , సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ లతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు నాగవంశీ.