తెలుగు చిత్రసీమలో కరోనా మహమ్మారి కలవరాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకానాయికలతో పాటు సాంకేతిక నిపుణులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా అగ్ర హీరో అల్లు అర్జున్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నా. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. అవకాశం ఉన్నవారందరూ వ్యాక్సిన్ వేయించుకొండి’ అని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కొన్నాళ్లుగా బన్నీ ‘పుష్ప’ షూటింగ్తో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన కరోనా బారిన పడటంతో షూటింగ్ను చిత్రబృందం నిలిపివేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.