అంకిత, అవంతిక, మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బీకాంలో ఫిజిక్స్’. సామ్ జె చైతన్య స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను ఇటీవల దర్శకుడు శివనాగేశ్వరరావు విడుదలచేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఆసక్తికరంగా ఉంటుంది. లాజిక్లను పక్కనపెట్టి వినోదానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాను రూపొందించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సెన్సార్కు వెళ్లనున్నాం. మే నెలలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. బోల్డ్ కంటెంట్తో పాటు సున్నితమైన అంశాన్ని చర్చిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించాలని దర్శకుడు శివనాగేశ్వరరావు అన్నారు.