Raju Srivastava | ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం మెరుగుపడుతున్నది. ఈ నెల 10న జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయనను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి స్వల్ప మెరుగుదల కనిపిస్తోందని ఆయన మేనేజర్ నయన్ సోని తెలిపారు. రాజు శ్రీవాస్తవ పరిస్థితి నెమ్మదిగా మెరుగవుతుందోని, చికిత్సకు స్పందిస్తున్నారన్నారు. శరీర భాగాలను కొంచెం కదిలించగలిగాడని, ఇంకా ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారన్నారు.
ఆయన స్పృహలోకి రావడానికి దాదాపు వారం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కమెడియన్ ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజు శ్రీవాస్తవ సోదరుడు దీపు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ విషయంపై ముంబై పోలీస్ సైబర్ సెల్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీవాస్తవ ఆరోగ్యం పరిస్థితిపై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆయన కుటుంబం విజ్ఞప్తి చేసింది. ఎయిమ్స్, శ్రీవాస్తవ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇచ్చే హెల్త్ అప్డేట్స్ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆయన కుటుంబం విజ్ఞప్తి చేసింది.