న్యూఢిల్లీ : ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఇటీవల జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. న్యూరో కార్డియాలజీ ఐసీయూ వెంటిలేటర్లో ఉన్నారు. అయితే, రాబోయే 24 గంటలు రాజుకు కీలకం కానుందని వైద్యులు పేర్కొన్నారు. కమెడియన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడంటూ వచ్చిన వార్తలను వైద్యులు కొట్టిపడేశారు.
రాజు అవయవాలన్నీ సక్రమంగానే పని చేస్తున్నాయని అతని స్నేహితుడు శేఖర్ సుమన్ తెలిపారు. శేఖర్ సుమన్ ఎప్పటికప్పుడు రాజు శ్రీవాస్తవ కుటుంబీకులతో మాట్లాడుతూ.. అతని ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలుపుతున్నాడు. ‘అతని (రాజు’ అవయవాలు అన్నీ సాధారణంగా పని చేస్తున్నాయి. ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ.. అతక్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది మహాదేవుడి కృపతో’ అంటూ ఆదివారం ట్వీట్ చేశాడు.