కథానాయిక ‘కలర్స్’ స్వాతి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఆమె రెండో వివాహం చేసుకున్నది. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా స్వాతి వెల్లడించింది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో కలర్స్ స్వాతి నాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీకాంత్తో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని తెలిసింది.
ఇప్పుడు ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో బుధవారం సంప్రదాయబద్ధంగా పెళ్లి వేడుక జరిగింది. కొత్త జంటకు పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసుని స్వాతి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకే ఈ జంట విడిపోయారు. అయితే తన విడాకుల విషయంపై స్వాతి ఎక్కడా స్పందించలేదు.