శ్రీనివాస రెడ్డి, రవిబాబు, సత్యం రాజేష్, రఘు బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. సతీష్ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ…‘వినోదం, థ్రిల్ అంశాలు చేర్చి ఈ చిత్రాన్ని రూపొందించాము. ఒక కాన్సెప్ట్తో కొత్త ప్రయత్నం చేశాం. ఇందులో సర్ప్రైజ్ ఉంది. త్వరలో అదేంటో చెబుతాం’ అన్నారు. నిర్మాత సతీష్ మాట్లాడుతూ..‘విభిన్న కాన్సెప్ట్తో కొత్త తరహాలో సినిమా తెరకెక్కించాం’ అన్నారు.