‘నా సినిమా థియేటర్లో వచ్చి మూడేళ్లయింది. ‘కోబ్రా’ విజువల్ ట్రీట్లా ఉంటుంది. యాక్షన్తో పాటు ఫ్యామిలీ, లవ్, రొమాన్స్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి’ అన్నారు చియాన్ విక్రమ్. ఆయన కథానాయకుడిగా ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన ‘కోబ్రా’ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ‘నా మీద రూపొందించిన ఏవీ చూసినప్పుడు ‘ఇన్ని పాత్రలు నేనే చేశానా?’ అని ఆశ్చర్యమేసింది. ఇంతటి ఎనర్జీని చూసి చాలా రోజులైంది. కోబ్రా అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మా ఆవిడ ఫోన్ చేసి తనకే టిక్కెట్లు దొరకలేదని చెప్పింది. ‘కోబ్రా’ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది’ అన్నారు. విజువల్ వండర్లా సినిమా తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. వినూత్న కథా చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని కథానాయికలు శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.