ప్రముఖ సినీ ఛాయాగ్రాహకుడు వి.జయరాం(70) కరోనా మహమ్మారితో గురువారం కన్నుమూశారు. తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు జయరాం సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. వరంగల్ ఆయన స్వస్థలం. చిరంజీవి హీరోగా నటించిన ‘చిరంజీవి’ చిత్రంతో జయరాం కెమెరామెన్గా అరంగేట్రం చేశారు. శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, 1921, శివశంకర్, పెళ్లి సందడి, మేజర్ చంద్రకాంత్తో పాటు పలు చిత్రాలను తన కెమెరాతో అందంగా తెరపై ఆవిష్కరించి ప్రతిభను చాటుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మమ్ముట్టి, మోహన్లాల్ వంటి అగ్ర తారల చిత్రాలకు కెమెరామెన్గా పనిచేశారు జయరాం. తెలుగులో రాఘవేంద్రరావు, మోహన్బాబు చిత్రాలకు ఎక్కువగా సినిమాటోగ్రఫీని అందించారు. జయరాం మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం
వ్యక్తంచేశారు.