By Maduri Mattaiah
కరోనా మహమ్మారి (Covid 19) విజృంభణతో అధికంగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. కరోనాతో థియేటర్లు (Cinema Theatres) మూతపడటంతో సినీ నిర్మాతలు అందరూ ఓటీటీ బాట పట్టారు. అగ్రతారల సినిమాలు సైతం ఓటీటీలోనే డైరెక్ట్గా విడుదల చేశారు. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు పుంజుకున్నాయి. థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే మునుపటిలా ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే కొంత మంది సినీ పెద్దలు మాత్రం ఇప్పటి వరకు జనాలందరిని రప్పించే సినిమా థియేటర్లకు రాలేదు. అందుకే వసూళ్లు ఆశాజనకంగా లేవని అంటున్నారు.
కరోనా మొదటి వేవ్ తరువాత థియేటర్లలో విడుదలై సొమ్ములు చేసుకున్న సినిమాలు ఉప్పెన, జాతిరత్నాలు మాత్రమే. ఇక సెకండ్వేవ్ తరువాత లవ్స్టోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, శ్రీదేవి సోడా సెంటర్ ఇలాంటి సినిమాలకు టాక్ బాగున్నా తొలి మూడు రోజులు మాత్రమే థియేటర్లలో జనాలు కనిపించారు..ఆ తరువాత షరా మామూలే..అయితే థియేటర్లకు జనాలు రాకపోవడానికి మరో కారణం వుందని కూడా అంటున్నారు. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఏ సినిమా ఏ ఓటీటీలో విడుదల కాబోతుందో ముందే సదరు ఓటీటీ సంస్థలు, నిర్మాతలు ప్రకటించడంతో..ప్రేక్షకులు కూడా సినిమా విడుదలైన రెండు వారాల్లో ఓటీటీలో వస్తున్నప్పుడు ఇక రిస్క్ తీసుకుని థియేటర్లకు ఎందుకు వెళ్లాలని అనుకొని…వెళ్లడం లేదని అంటున్నారు.
తమ సినిమాలు ఓటీటీలకు ఇచ్చేస్తున్న నిర్మాతలు కనీసం సినిమా థియేటర్స్లో వున్న రోజుల్లోనైనా ఓటీటీ పబ్లిసిటి ఆపితే..కనీసం రెగ్యులర్ సినీ ప్రేక్షకులైనా థియేటర్ల వైపు చూస్తారు..లేదంటే వుందిగా..ఓటీటీ అంటూ థియేటర్ల వైపు చూడకపోవచ్చు.
Drishyam 2 | దృశ్యం-2 ఓటీటీలోనే :
కొంత మంది నిర్మాతలు ఇప్పటికి కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇటీవల నాని టక్ జగదీష్ను డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల కాగా, ఇక సూర్య నటించిన జైభీమ్ కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే త్వరలో వెంకటేశ్ నటించిన దృశ్యం సీక్వెల్ దృశ్యం-2 (Drishyam 2)ను కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల కాబోతుంది. కొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కావడం వల్ల నిర్మాతలకు లాభమే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. అయితే థియేటర్లో విడుదలైన సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి కనీసం నాలుగు వారాలు సమయం తీసుకోవడంతో పాటు, సినిమా థియేటర్స్లో వున్నప్పుడు ఓటీటీలో సినిమా ప్రచారం ఆపితే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే అవకాశం వుందని..లేదంటే త్వరలోనే ఓటీటీలో వస్తుంది కదా..అని థియేటర్ సినిమాను వాయిదా వేసుకుంటారని అంటున్నారు.
–Maduri Mattaiah
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar Award | దివంగత పునీత్ రాజ్కుమార్కు అరుదైన గౌరవం
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్