సినిమా షూటింగ్స్ (Cinema Shootings) రీస్టార్ట్ చేయడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Producers Guild) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ మొదలు కానున్నాయి. ఆగస్టు 25 నుంచి విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల షూటింగ్స్ షురూ కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయనున్నట్టు నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), సీ కల్యాణ్ వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ..గత 23 రోజులుగా మా సమస్యలు ఏంటనేవి చర్చిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి కృష్టి చేస్తున్నాం.సెప్టెంబర్ 1 నుండి షూటింగ్స్ మొదలుపెడుతున్నాం. మేమంతా మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని అగ్రిమెంట్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు 30న తుది నిర్ణయాన్ని చిత్రపరిశ్రమకు తెలియజేస్తాం. ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు వీపీఎఫ్ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇక నుంచి అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలుంటాయి. పెద్ద సినిమాలకు మాత్రం టికెట్ ధర కొంతమొత్తంలో పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. టికెట్ ధరలు, తినుబండారాల ధరలు అందుబాటులోనే ఉంటాయన్నారు.
23 రోజులుగా నిర్మాతలందరం అన్ని శాఖల్లోని సమస్యలపై చర్చిస్తున్నాం. ఇప్పటికీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మిగిలిన నిర్ణయాలపై మరో 2 రోజుల్లో క్లారిటీ ఇస్తాం. సెప్టెంబర్ షూటింగ్స్ జరుపుకోవచ్చు. ఒకవేళ అత్యవసరమైతే ఆగస్టు 25 నుంచి ఛాంబర్ అనుమతితో షూటింగ్స్ చేసుకోవచ్చునని సీ కల్యాణ్ (C kalyan) పేర్కొన్నారు.