రామ్తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, సంపూర్ణేష్బాబు ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘చోర శికామణులు’. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఆనంద్ కూర్మా. బానూరు నాగరాజు నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. నిర్మాతలు వి.దామోదరప్రసాద్, టి.ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కలిసి స్క్రిప్ట్ని దర్శకునికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి పాట చిత్రీకరణతో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్ రాజవిక్రమ్.