2016లో వచ్చిన పింక్ రీమేక్గా తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. కోర్టు రూమ్ డ్రామాగా శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. పవన్ కళ్యాణ్, గ్లామర్ బ్యూటీ శృతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించగా, ప్రకాష్ రాజ్ డిఫెన్స్ లాయర్గా అదరగొట్టారు. తొలి రోజు నుండి మంచి కలెక్షన్స్తో దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని గత రాత్రి చిరంజీవి కుటుంబ సభ్యులు వీక్షించారు.
వకీల్ సాబ్ చిత్రాన్ని చూసి తెగ సంతోషించిన చిరు తాజాగా చిత్రంతో పాటు మూవీ బృందంపై ప్రశంసలు కురిపించారు. మూడు సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్లో అదే వేడి, అదే వాడి, అదే పవర్. ప్రకాశ్ రాజ్తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. అనన్య, అంజలి, నివేధా థామస్ వాళ్ల వాళ్ల పాత్రలలో జీవించేశారు. థమన్, డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోనీ కపూర్, మిగతా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. అన్నింటికి మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే అత్యవరమైన చిత్రం వకీల్ సాబ్. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు, అందరి మనసులని గెలుస్తాడు అంటూ చిరు తన ట్వీట్లో పేర్కోన్నారు.