అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుటుంబమంతా హోమ్ఐసోలేషన్లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నామని తెలిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..ఎన్టీఆర్కు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారని..ఆయనతో మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చిందని చిరంజీవి ట్విట్టర్లో తెలిపారు. ‘తారక్తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో ఉన్నానని చెప్పారు. తారక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ బాగున్నారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్గా ఉన్నారని తెలుసుకొని హ్యాపీగా ఫీలయ్యా. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని చిరంజీవి ట్విట్టరో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకుడు. ఈ సినిమా పూర్తయిన అనంతరం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.