సినిమా టిక్కెట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అధే విధంగా థియేటర్స్ మనుగడ కోసం సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు బతువు తెరువు కోసం తగ్గించిన టికెట్ రేట్స్ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.
దేశమంతా ఒకటే జీఎస్టీ ట్యాక్స్లు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులు బాటు ఉండడం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించడం. ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుగోగలుగుతుందని చిరు తన ట్వీట్లో పేర్కోన్నారు. కాగా, రోజుకి నాలుగు ఆటలు మాత్రమే.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు.. మిడ్ నైట్ షోలు, బెన్ఫిట్ షోలు, స్పెషల్ షోలకు నో పర్మిషన్.. సామాజిక సేవాకార్యక్రమాలకు సంబంధించి నిధుల సేకరణ కోసమైతేనే బెన్ఫిట్ షోలకు అనుమతి అని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.