గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్పీ)లో తెలుగు అగ్ర నటుడు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఈ ఏడాదికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేయడంతో పాటు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు.
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ…‘చిరంజీవి ప్రఖ్యాత నటుడే కాక రాజకీయ నాయకుడు, సామాజిక సేవకుడు. ఆయన దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ ఇతర దక్షిణాది చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. చిరంజీవికి ఇఫ్పీ జీనవ సాఫల్య పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం’ అన్నారు. ఈనెల 20న ప్రారంభమైన ఇఫ్పీ వేడుకలు 28వ తేదీతో ముగియనున్నాయి.