Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఆయన రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ కావడంతో సినీ పరిశ్రమలో చిరు మళ్లీ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య చిత్రానికి మంచి స్పందన రాకపోవడం, గాడ్ ఫాదర్ సినిమా అంచనాలు అందుకోకపోవడం ఫ్యాన్స్ని నిరాశపరిచింది.ఆ తరువాత వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినప్పటికీ, భోళా శంకర్ నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత దాదాపు ఏడాది పాటు చిరంజీవిని వెండి తెరపై చూడడం సాధ్యం కాలేదు.
కొన్నాళ్లుగా విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు చిరు. ఈ సినిమా 2026 సమ్మర్కు రానుంది.. గ్రాఫిక్స్, కొన్ని రీ-షూట్లు కారణంగా రిలీజ్ ఆలస్యం అయింది. ఏదేమైన సమ్మర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి కాగా, చిన్న ప్యాచ్ వర్క్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోంది.మరోవైపు అనీల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
చిరు – బాబి కాంబినేషన్లో కొత్త చిత్రం 2026 దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, చిరు.. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయనుండగా, ఈ సినిమాని 2026లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఏదేమైనా 2025లో చిరు నుంచి ఒక్క సినిమా రాకపోయినా 2026లో మాత్రం వడ్డీతో సహా తీర్చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్