మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాదు సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా అందరి మనసులు గెలుచుకున్నాడు. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు చిరు.అభిమానులకి కూడా పలు సందర్భాలలో సాయాలు చేశారు మెగాస్టార్.తాజాగా విశాఖపట్నానికి చెందిన వెంకట్ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయనకు ఫ్లైట్ టిక్కెట్స్ పంపి ఇంటికి పిలిపించుకున్నారు చిరు.
స్వయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఆస్పత్రికి తరలించారు. అవరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపిన చిరంజీవి కూలంకషంగా వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఒమేగా హాస్పిటల్స్ లో తెలిసిన డాక్టర్లతో మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెల్సుకున్నారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చలు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారట చిరు.వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్, ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు.చిరంజీవి దాతృత్వంపై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.