అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చిరంజీవి, బాలీవుడ్ నాయిక మౌనిరాయ్లపై తెరకెక్కించిన ప్రత్యేకగీతంతో షూటింగ్ కంప్లీట్ చేశామని మేకర్స్ తెలిపారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
ఈ స్పెషల్సాంగ్కు భీమ్స్ సిసిరోలియో స్వరాల్ని సమకూర్చగా కాసర్ల శ్యామ్ రచించారు. గణేష్ ఆచార్య నృత్యరీతుల్ని అందించిన ఈ పాటను వందమంది డ్యాన్సర్లతో గ్రాండ్గా తెరకెక్కించామని, చిరంజీవి తన సిగ్నేచర్ స్టెప్స్తో అదరగొట్టారని చిత్రబృందం పేర్కొంది.
బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్న విషయం తెలిసిందే. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: వశిష్ట.