ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్పై సినీ జనాలలో అంచనాలు భారీగా ఉంటున్నాయి. తాజాగా మరో క్రేజీ కాంబోసెట్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాలలోకి వెళితే రీసెంట్గా అఖండతో బడా హిట్ కొట్టిన బోయపాటి శీను త్వరలో అల్లు అర్జున్తో సినిమా చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
గీతా ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత చిరంజీవితో బోయపాటి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇది ఎమోషన్ తో కూడిన పక్కా మస్ యాక్షన్ మూవీ అని అంటున్నారు. అఖండలో బాలయ్యని చాలా పవర్ఫుల్గా చూపించడంతో చిరు ఫుల్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ క్రమంలో బోయపాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం చిరంజీవి చేసిన సినిమాల్లో ‘ఆచార్య;’ విడుదలకు సిద్ధమవుతూ ఉండగా ‘గాడ్ ఫాదర్’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత లైన్లో మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ .. బాబీ ‘వాల్తేర్ వీర్రాజు’ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఆయన బోయపాటితో చేయాలనుకుంటే అందుకు పూర్తి అవకాశం ఉంటుంది.