టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషాదంలో మునిగిపోయారు. తనని ఆదరించి, అభిమానించే ఫ్యాన్స్లో కీలక వ్యక్తులు ఇద్దరు చనిపోవడం చిరంజీవిని కలచివేసింది. తన బ్లడ్ బ్రదర్స్ అయినటువంటి కదిరి వ్యాస్తవ్యులు ప్రసాద్ రెడ్డిగారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి కన్నుమూశారు. వారు ఇక లేరన్న వార్త నా హృదయాన్ని కలచివేసిందని సోషల్ మీడియా వేదికగాచిరంజీవి బాధని అభిమానులతో పంచుకున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మెగాస్టార్.